తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 8,200 టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్.
Kumar,04/02/2017
ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజండా.
● ఫైలు పై సియం కెసిఆర్ సంతకం
● ఈ నెలాఖరున లేదా వచ్చేనేలలో నోటిఫికేషన్
● ఈ సారైనా భర్తి చేస్తారో లేదో,ఐదేళ్ళుగా 6.5 లక్షల మంది ఎదురు చూపు.
ప్రభుత్వ పాఠశాలల్లో 8,200 టీచర్ల పోస్టులు భర్తీ కీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీయం చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 12,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ గతేడాది ఓకే చెప్పింది. 15,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గురుకుల పాఠశాలలో పోస్టులు గాక, ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నే 12,000 టీచర్ పోస్టులు కు పచ్చజండా ఊపింది. అయితే హేతుబదిలీకరణ తర్వాత నే చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి దాకా హేతుబదిలీకరణ ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ...క్షేత్ర స్థాయిలో అవసరాలపై విద్యాశాఖ అధికారులు లెక్కలు వేసినట్లు తెలిసింది. అయితే వాటిని బహిర్గతం చేయలేదు. ఈ లెక్క ప్రకారమే పాఠశాలల్లో 8,200 పోస్టులకు ప్రభుత్వం ఓకే చేప్పినట్లు తేలుస్తుంది. ఈ నెలాఖరున లేదా వచ్చేనేలలో నోటిఫికేషన్ టీఎస్పిఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వెలువడతాయని ప్రభుత్వం తెలిపింది.
టెట్ పై త్వరలో స్పష్టత.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే గురుకులాల్లో టీచర్ పోస్టులు భర్తీ కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టేట్) పై స్పష్టత రావాల్సి ఉంది.
Kumar,04/02/2017
ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజండా.
● ఫైలు పై సియం కెసిఆర్ సంతకం
● ఈ నెలాఖరున లేదా వచ్చేనేలలో నోటిఫికేషన్
● ఈ సారైనా భర్తి చేస్తారో లేదో,ఐదేళ్ళుగా 6.5 లక్షల మంది ఎదురు చూపు.
ప్రభుత్వ పాఠశాలల్లో 8,200 టీచర్ల పోస్టులు భర్తీ కీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీయం చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 12,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ గతేడాది ఓకే చెప్పింది. 15,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గురుకుల పాఠశాలలో పోస్టులు గాక, ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నే 12,000 టీచర్ పోస్టులు కు పచ్చజండా ఊపింది. అయితే హేతుబదిలీకరణ తర్వాత నే చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి దాకా హేతుబదిలీకరణ ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ...క్షేత్ర స్థాయిలో అవసరాలపై విద్యాశాఖ అధికారులు లెక్కలు వేసినట్లు తెలిసింది. అయితే వాటిని బహిర్గతం చేయలేదు. ఈ లెక్క ప్రకారమే పాఠశాలల్లో 8,200 పోస్టులకు ప్రభుత్వం ఓకే చేప్పినట్లు తేలుస్తుంది. ఈ నెలాఖరున లేదా వచ్చేనేలలో నోటిఫికేషన్ టీఎస్పిఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వెలువడతాయని ప్రభుత్వం తెలిపింది.
టెట్ పై త్వరలో స్పష్టత.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే గురుకులాల్లో టీచర్ పోస్టులు భర్తీ కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టేట్) పై స్పష్టత రావాల్సి ఉంది.

No comments:
Post a Comment